తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ వస్తువులను మీ సొంతం చేసుకోండిలా...

ప్రధాని మోదీకి అందిన దాదాపు 2,700 కానుకలను ఆన్​లైన్​లో వేలం వేయనున్నట్టు సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్​ పటేల్​ తెలిపారు. వీటి ధర కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ. 2.5 లక్షలని స్పష్టం చేశారు.

By

Published : Sep 11, 2019, 2:59 PM IST

Updated : Sep 30, 2019, 5:48 AM IST

మోదీ వస్తువులను మీ సొంతం చేసుకోండిలా...

మోదీ వస్తువులను మీ సొంతం చేసుకోండిలా...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వేర్వేరు సందర్భాల్లో అందిన 2వేల 772 కానుకలను వేలం వేయనున్నారు. ఈ విషయాన్ని సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్​ పటేల్​ వెల్లడించారు. ఆన్​లైన్​ ద్వారా వేలం నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ వస్తువుల ధర రూ.200- రూ. 2.5 లక్షల మధ్యలో ఉంటుందని పటేల్​ తెలిపారు.

మోదీ వస్తువులు ఇలా వేలం వేయడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది జనవరిలోనూ దాదాపు 14 రోజుల పాటు వేలం నిర్వహించారు. 18వందలకుపైగా కానుకల విక్రయంతో వచ్చిన నిధులను గంగానది ప్రక్షాళన కోసం ఉద్దేశించిన 'నమామి గంగా' ప్రాజెక్టుకు ఇచ్చారు.

ఇదీ చూడండి:-అభాగ్యురాలి అంతిమయాత్రకు సైకిలే రథమైంది!

Last Updated : Sep 30, 2019, 5:48 AM IST

ABOUT THE AUTHOR

...view details