ప్రస్తుతం జమ్మూలో 100 శాతం, కశ్మీర్లో 20 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారని కేంద్ర హోంశాఖ తెలిపింది. మొత్తంగా రాష్ట్రంలో 21 వేల 328 పాఠశాలలు తెరుచుకున్నాయని వెల్లడించింది. జమ్ముకశ్మీర్లో జనసంచారంపై ఎలాంటి ఆంక్షలు లేవని ప్రకటించింది.
అక్టోబర్ 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,02,069 ల్యాండ్లైన్ఫోన్ల సేవలను పునరుద్ధరించామని గత శుక్రవారం వరకు 22 జిల్లాల్లో 84 శాతం చరవాణి సేవలను పునరుద్ధరించినట్లు హోంశాఖ తెలిపింది.