తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శబరిమలలో భారీగా భద్రత మోహరింపు - నవంబర్​ 17 నుంచి శబరిమల యాత్ర

శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తనున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేయనుంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో 10 వేల మందికిపైగా పోలీసులను మోహరించనున్నట్లు వెల్లడించారు అధికారులు. నవంబర్​ 17 నుంచి శబరిమల యాత్ర ప్రారంభం కానుంది.

శబరిమలలో భారీగా భద్రత మోహరింపు

By

Published : Nov 13, 2019, 6:21 PM IST

శబరిమలలో అయ్యప్ప దర్శనార్థం భక్తులను నవంబర్​ 17 నుంచి ఆలయంలోకి అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కల్పించటానికి 5 దశలుగా 10 వేల 17 మంది పోలీసులను నియమించినట్లు అధికారులు తెలిపారు.

24 మంది ఎస్పీలు, అసిస్టెంట్​ ఎస్పీలు, 112 డిప్యూటీ ఎస్పీలు, 264 మంది ఇన్​స్పెక్టర్లు, 1185 మంది సబ్​-ఇన్​స్పెక్టర్లను నియమించినట్లు వెల్లడించారు. 307 మంది మహిళా పోలీసులతో సహా మొత్తం 8402 మంది పోలీస్​ అధికారులు విధులను నిర్వహిస్తారని ప్రకటన విడుదల చేశారు.

మొదటి దశలో 2 వేల మందికిపైగా...

నవంబర్​ 15-30 మధ్య మొదటి దశలో 2,551 మంది పోలీసులు ఆలయ సన్నిధానం, పంబా, నీలకల్, ఎరుమెలి, పతనంతిట్ట ప్రాంతాల్లో భద్రతను కల్పిస్తారని పేర్కొన్నారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​.. ఇటీవల సన్నాహకాలను దగ్గరుండి పరిశీలించారు. ఆలయ బాధ్యతలను చూసే ట్రావెన్​కోర్​ దేవస్వామ్​ బోర్డు సహా.. ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సుప్రీం తీర్పుతో ఆందోళనలు...

ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలకు అనుమతినిస్తూ సుప్రీం కోర్టు 2018లో చారిత్రక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశాల మేరకు.. ఎల్​డీఎఫ్​ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ సమయంలో ఆందోళనలు చెలరేగాయి.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. తక్షణమే అమల్లోకి

ABOUT THE AUTHOR

...view details