త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి.. విపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు ఇతర పక్షాలతో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది. ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 14న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అదే రోజు రాజ్యసభ నూతన డిప్యూటీ ఛైర్మన్ను ఎన్నుకుంటారు.