తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డీఆర్​డీఓకు అభినందనలు- మోదీపై విమర్శలు

మిషన్ శక్తి ప్రాజెక్టు విజయవంతమైందన్న ప్రధాని ప్రకటనపై వివిధ రాజకీయ పక్షాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ డీఆర్​డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూనే మోదీకి చురకలంటించారు.

By

Published : Mar 27, 2019, 5:37 PM IST

డీఆర్​డీవోకు అభినందనలు... మోదీపై విమర్శలు

మిషన్​ శక్తి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు డీఆర్​డీఓ శాస్త్రవేత్తలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. దేశానికి గర్వకారణమని ట్విటర్ వేదికగా కొనియాడారు. అయితే మిషన్​ శక్తిపై ప్రధాని దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగాన్ని తప్పు పడుతూ ఛలోక్తులు విసిరారు రాహుల్​.

రాహుల్ గాంధీ

'మోదీకి ప్రపంచ నాటక దినోత్సవ శుభాకాంక్షలు' -రాహుల్​ ట్వీట్

మమతా బెనర్జీ స్పందన

డీఆర్​డీఓ శాస్త్రవేత్తల ఘనతను మోదీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ.

మమతా బెనర్జీ

"ఇతరుల సాధించిన ఘనతను మోదీ తన విజయంగా చెప్పుకోవడం మానాలి. ఉపగ్రహాన్ని కూల్చింది డీఆర్​డీఓ శాస్త్రవేత్తలు. ఐదేళ్లుగా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ఎన్నికలకు ముందు ప్రజలను అవివేకులను చేసే పనులను భాజపా, మోదీ మానుకోవాలి. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఏమీ ఉండదు."
- ట్విటర్​లో మమతా బెనర్జీ

అఖిలేశ్ యాదవ్ స్పందన

ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా ప్రధాని టీవీ కార్యక్రమాల్లోనే కాలక్షేపం చేస్తున్నారని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ అన్నారు. దేశ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

అఖిలేశ్ యాదవ్

" ఈరోజు ప్రధాని గంటపాటు టీవీకే అంకితమయ్యారు. నిరుద్యోగం, గ్రామీణసంక్షోభం, మహిళల భద్రత వంటి సమస్యల నుంచి దేశ ప్రజల దృష్టిని ఆకాశం వైపు మళ్లిస్తున్నారు. అద్భుత విజయం సాధించినందుకు డీఆర్​డీఓకు అభినందనలు."
-అఖిలేశ్​ యాదవ్, యూపీ మాజీ సీఎం

డీఆర్​డీఓ విజయం యూపీఏ ఘనతే: కాంగ్రెస్ ​

యూపీఏ ప్రభుత్వ హయంలో శ్రీకారం చుట్టిన ఏశాట్​ కార్యక్రమం ఇప్పటికి సత్ఫలితాలిచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్​ సింగ్​ను ప్రశంసించారు.

అహ్మద్ పటేల్
కాంగ్రెస్ ట్విటర్

"ఈ ఘనత సాధించినందుకు డీఆర్​డీఓ, ప్రభుత్వానికి అభినందనలు. భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు 1961లో జవహర్​లాల్​ నెహ్రూ ప్రారంభించారు. ఇందిరా గాంధీ హయాంలో నెలకొల్పిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎన్నో ఘనతలు సాధించి దేశానికి గర్వకారణమైంది. "
-కాంగ్రెస్ అధికారిక ట్విటర్ పేజీ

దేశ భద్రత అంశాలు ఎన్నికల నియమాళిలోకి రావు: ఈసీ

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో మిషన్ శక్తి విజయవంతమైందని ప్రధాని ప్రకటించడం ఎన్నికల కోడ్​ను ఉల్లంఘించడం కాదా అన్న సందేహాలకు ఎన్నికల సంఘం సమాధానమిచ్చింది.

దేశ భద్రతకు సంబంధించిన విషయాలకు ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తించదని అధికారులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details