శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ఆదాయానికి సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్ ఇచ్చారు. దేశాన్ని దోచుకున్న వారికి మాత్రమే సబ్సిడీ.. లాభంలా కనిపిస్తుందని ఎద్దేవాచేశారు. 'మహమ్మారి అలుముకున్నవేళ, ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే.. దాన్ని ఆసరాగా చేసుకుని ఈ పేదల వ్యతిరేక ప్రభుత్వం సంక్షోభంలోనూ లాభాలు గడించింది' అని ఆరోపించారు రాహుల్ గాంధీ.
దీనిపై పీయూష్ గోయల్ స్పందిస్తూ... 'దేశాన్ని దోచుకున్న వారికి మాత్రమే సబ్సిడీ.. లాభంలా కనిపిస్తుంది. శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడిపినందుకు రాష్ట్రాలు చెల్లించినదానికంటే ఎక్కువ మొత్తం రైల్వేశాఖ ఖర్చు చేసింది' అని గోయల్ తెలిపారు.