తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మిషన్​ శక్తిపై కేంద్రం ప్రకటన అవివేక చర్య'

సైనిక రహస్యాలను బయటకు వెల్లడించి భాజపా ప్రభుత్వం దేశ రక్షణకు విఘాతం కలిగించిందని కాంగ్రెస్​ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ట్విట్టర్​ వేదికగా విమర్శించారు. అవివేక ప్రభుత్వాలు మాత్రమే రక్షణ రహస్యాలు బహిర్గతం చేస్తాయని దుయ్యబట్టారు.

By

Published : Mar 30, 2019, 5:35 PM IST

Updated : Mar 30, 2019, 7:55 PM IST

ఇది కచ్చితంగా దేశరక్షణకు విఘాతమే: చిదంబరం

'మిషన్​ శక్తిపై కేంద్రం ప్రకటన అవివేక చర్య'

దేశ సైనిక రహస్యాలను అవివేక ప్రభుత్వం మాత్రమే వెల్లడిస్తుందని కాంగ్రెస్​ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతమైన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఏ కారణంతో సైనిక రహస్యాలను వెల్లడించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ట్విట్టర్​ వేదికగా డిమాండ్​ చేశారు.

"భారత్​కు చాలా ఏళ్ల క్రితం నుంచే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి పరిజ్ఞానం, సామర్థ్యం ఉంది. తెలివైన ప్రభుత్వం ఈ సైనికి శక్తిసామర్థ్యాలను రహస్యంగా ఉంచుతుంది. అవివేక ప్రభుత్వం మాత్రమే సైనిక రహస్యాలను బహిర్గతం చేసి ద్రోహానికి పాల్పడుతుంది."
- చిదంబరం, మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్​ నేత ట్వీట్​

ఇది కచ్చితంగా దేశరక్షణకు విఘాతమే: చిదంబరం

"సార్వత్రిక ఎన్నికల సమయంలోనే మోదీ ఈ ప్రకటన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే లోక్​సభ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే భాజపా ఈ కుయుక్తి పన్నింది" అని చిదంబరం దుయ్యబట్టారు.

ఇది కచ్చితంగా దేశరక్షణకు విఘాతమే: చిదంబరం

మోదీ ప్రకటన..విపక్షాల నిరసన

ప్రధాని మోదీ ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం 'మిషన్ శక్తి' విజయవంతం అయినట్లు బుధవారం ప్రకటించారు. ఈ విజయంతో అంతరిక్ష యుద్ధ రంగంలో భారత్ మరో మైలురాయిని చేరుకుందని... అమెరికా, రష్యా, చైనాల తరువాత ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా నిలిచిందన్నారు.

మోదీ ప్రకటనపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అయితే దేశ రక్షణ విషయాలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు రావని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఇదీ చూడండి :'దేశానిదో దారి... విపక్షానిది మరో దారి'

Last Updated : Mar 30, 2019, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details