తెలంగాణ

telangana

'కేరళ' విద్యార్థినికి కరోనా.. నిలకడగా ఆరోగ్యం

By

Published : Jan 30, 2020, 1:46 PM IST

Updated : Feb 28, 2020, 12:45 PM IST

one-positive-case-of-novel-coronavirus in-kerala
భారత్​కు 'కరోనా'- కేరళలో తొలి పాజిటివ్ కేసు

16:07 January 30


చైనాలో ప్రబలిన ప్రాణాంతక కరోనా వైరస్​ భారత్​కు పాకింది. కేరళలో తొలి కేసును నిర్ధరించారు వైద్యులు. వుహాన్​ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థినికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా సోకినట్లు తేలినట్లు ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. 

20 నమూనాలను వైద్య పరీక్షలకు పంపగా.. ఒకటి పాజిటివ్​గా తేలినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. ప్రస్తుతం ఆ యువతిని త్రిశూర్​ ప్రధానాస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా కలకలంతో సదరు విద్యార్థిని భారత్​కు తిరిగివచ్చిందన్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు స్పష్టం చేశారు. 

చైనా నుంచి వచ్చే ప్రయాణికులు ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలన్నారు శైలజ. వారికి గృహ నిర్బంధం తప్పనిసరి అని బోర్డు ఆదేశించినట్లు వివరించారు. 

భయం భయం...

కేరళ వాసికి కరోనా సోకిందన్న వార్తతో దేశ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పలు రాష్ట్రాల్లో ఈ వైరస్​ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కరోనా వైరస్​ కారణంగా చైనాలో ఇప్పటివరకు 170 మంది మరణించారు. వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. 

13:44 January 30

'కేరళ' విద్యార్థినికి కరోనా.. నిలకడగా ఆరోగ్యం

రాకాసి కరోనా వైరస్​ భారత్​లోకి ప్రవేశించింది. కేరళలో తొలి కేసును నిర్ధరించారు వైద్యులు. చైనాలోని వుహాన్​ విశ్వవిద్యాలయం విద్యార్థికి వైరస్ సోకినట్లు తేలిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

Last Updated : Feb 28, 2020, 12:45 PM IST

For All Latest Updates

TAGGED:

corona

ABOUT THE AUTHOR

...view details