తెలంగాణ

telangana

By

Published : May 9, 2020, 7:29 AM IST

Updated : May 9, 2020, 9:15 AM IST

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. నలుగురు నక్సల్స్​ మృతి

One Police Sub Inspector (SI) lost his life and 4 naxals killed in an encounter
ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. నలుగురు నక్సల్స్​ మృతి

09:04 May 09

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. నలుగురు నక్సల్స్​ మృతి

ఛత్తీస్​గఢ్​లోని రాజ్​నంద్​గాంవ్​ జిల్లా పర్ధోనీ గ్రామంలో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల్లో ఓ ఎస్సై కూడా ప్రాణాలు కోల్పోయారు. నక్సల్స్​ నుంచి ఏకే-47, ఎస్​ఎల్​ఆర్​ రైఫిళ్లు​, రెండు 315 బోర్​ రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు.  

పర్ధోనీ గ్రామంలోకి మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. గస్తీ బృందాలు మన్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోకి ప్రవేశించగానే.. నక్సల్స్​ బయటకువచ్చారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి.  

ఈ ఘటనలో మదన్​వాడా పోలీస్​ స్టేషన్​​ హౌస్​ ఆఫీసర్​గా ఉన్న ఎస్సై ఎస్​కే శర్మ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర భద్రతా సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్​ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.  

07:21 May 09

ఎన్​కౌంటర్​లో ఎస్సై, నలుగురు నక్సల్స్​ మృతి

ఛత్తీస్​గఢ్​లోని పర్ధోనీ గ్రామంలో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. కాల్పుల్లో ఓ ఎస్సై కూడా ప్రాణాలు కోల్పోయారు. నక్సల్స్​ నుంచి ఏకే-47 రైఫిల్​ భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. 

Last Updated : May 9, 2020, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details