తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ వీడియోపై రాహుల్, నడ్డా మాటల యుద్ధం - భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా

ప్రధాని మోదీని నాశనం చేసేందుకు ఓ రాజవంశం (రాహుల్ గాంధీ కుటుంబం) చాలాకాలంగా ప్రయత్నిస్తోందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ప్రధాని మోదీ బలమైన వ్యక్తి అనడం పూర్తిగా కల్పితమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వీడియో విడుదల చేసిన నేపథ్యంలో నడ్డా... ఈ ప్రతివిమర్శలకు పూనుకున్నారు.

BJP Chief JP Nadda hits back at RaGa over new video on Indo-China faceoff
మోదీని నాశనం చేసేందుకు ఓ రాజవంశం ప్రయత్నిస్తోంది: నడ్డా

By

Published : Jul 20, 2020, 3:49 PM IST

ప్రధాని నరేంద్ర మోదీని 'ఫేక్ స్ట్రాంగ్ మ్యాన్' అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వీడియో విడుదల చేయడంపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా విదేశాంగ వ్యవహారాల(భారత్​-చైనా సరిహద్దు వివాదం)పై రాజకీయం చేసేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ సారథ్య బాధ్యతల్ని రాహుల్​ గాంధీకి మరోమారు అప్పగించేందుకు వీడియోల ద్వారా చేస్తున్న ఈ ప్రయత్నమూ విఫలమైందని ఎద్దేవా చేశారు నడ్డా.

"డోక్లాం, తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయ సరిహద్దు ఘర్షణ విషయంలోనూ రాహుల్ గాంధీ... చైనా బలాన్ని నమ్ముతున్నారే గానీ, భారత సాయుధ దళాలను విశ్వసించడం లేదు. నిజానికి ఈ రాజవంశం (గాంధీల కుటుంబం) బలహీనమైన భారతదేశాన్ని, బలమైన చైనాను కోరుకుంటోంది. ఎందుకు?"

- జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు

మోదీ బలమైన వ్యక్తి అన్నది ఓ కల్పితం

ప్రధాని మోదీ బలమైన వ్యక్తి అన్నది ఓ కల్పితమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.

"ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చేందుకు తనను తాను బలమైన వ్యక్తిగా చిత్రీకరించుకున్నారు. ఇప్పుడు ఇదే దేశానికి అతిపెద్ద బలహీనతగా మారింది. ప్రస్తుతం భారత​ భూభాగాన్ని చైనా ఆక్రమించింది. మోదీ తన 56 అంగుళాల ఛాతీ సిద్ధాంతాన్ని కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

మోదీని దెబ్బతీసేందుకే!

రాహుల్ గాంధీ విమర్శలను... భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా తిప్పికొట్టారు. 'కొన్నేళ్లుగా ఓ రాజవంశం(రాహుల్ గాంధీ కుటుంబం)... ప్రధాని మోదీని నాశనం చేయడానికి చూస్తోంది' అని ఆరోపించారు.

"130 కోట్ల మంది భారతీయుల హృదయాల్లో మోదీ గూడుకట్టుకుని ఉన్నారు. మోదీ ప్రజల కోసమే జీవిస్తున్నారు... పనిచేస్తున్నారు. ఆయన్ని నాశనం చేయాలన్న వారు... తమ సొంత పార్టీనే నాశనం చేసుకుంటున్నారు."

- జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు

యూపీఏ హయాంలోనే...

"1962 నాటి (భారత్​-చైనా యుద్ధం) పాపాలను కడిగేసేందుకు ఓ రాజవంశం (రాహుల్ గాంధీ కుటుంబం) ప్రయత్నిస్తోంది. అందుకే దేశ రక్షణ, విదేశాంగ విధానాలను రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోంది."

- జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు

1950ల నుంచే చైనా... ఓ రాజవంశానికి వ్యూహాత్మకంగా ఆర్థిక లబ్ధి చేకూరుస్తోందని నడ్డా పేర్కొన్నారు. అందువల్లే యూపీఏ హయాంలో చైనా... భారత భూభాగాన్ని ఆక్రమించుకోగలిగిందని ఆరోపించారు.

ఇదీ చూడండి:మరోసారి భారీ విధ్వంసానికి ముష్కరుల కుట్ర!

ABOUT THE AUTHOR

...view details