రాజస్థాన్లో కరోనా సోకిన ఓ వ్యక్తి నుంచి మరో 17 మందికి వైరస్ వ్యాపించింది. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. అప్రమత్తమైన అధికారులు.. ఆ బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులందరినీ గుర్తించే పనిలో పడ్డారు.
జైపుర్లోని రామ్గంజ్కు చెందిన ఆ వ్యక్తి ఇటీవల అనారోగ్యం పాలయ్యాడు. వైద్యులు పరీక్షలు చేసి అతడికి కరోనా సోకినట్లు నిర్ధరించారు. అయితే... కొద్ది రోజుల తర్వాత అదే ప్రాంతంలో మరిన్ని కేసులు వెలుగుచూశాయి. బాధితులంతా ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారేనని గుర్తించారు అధికారులు.
ఈ ఘటనను ఉదహరిస్తూ సామాజిక దూరమే కరోనా నియంత్రణకు ఏకైక మార్గమని హితబోధ చేస్తున్నారు అధికారులు. అదే కరోనా అంతానికి కీలకమని ఉద్ఘాటిస్తున్నారు.