ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్​ డే కాదు.. పేరెంట్స్​ డే..! - ఫిబ్రవరి 14 వాలెంటైన్స్​ డే కాదు.. పేరెంట్స్​ డే..!

ప్రేమికుల దినోత్సవం రోజు గుజరాత్​లో మాతృ పితృ పూజన్​ దివస్ (తల్లిదండ్రుల పూజోత్సవం)ను నిర్వహించనున్నారు. భారతీయ సంప్రదాయ విలువలను విద్యార్థుల్లో పెంపొందించేందుకే ఈ కార్యక్రమం జరపనున్నట్లు స్పష్టం చేశారు సూరత్​ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ).

on-valentines-day-matru-pitru-pujan-diwas-for-guj-schools
ఫిబ్రవరి 14 వాలెంటైన్స్​ డే కాదు.. పేరెంట్స్​ డే..!
author img

By

Published : Feb 9, 2020, 9:29 AM IST

Updated : Feb 29, 2020, 5:30 PM IST

ఫిబ్రవరి 14 అంటే టక్కున గుర్తొచ్చేది ప్రేమికుల దినోత్సవం.. కానీ గుజరాత్ సూరత్​లో ఇలా కాదు. అక్కడ అదే రోజున ప్రతి పాఠశాలలో విద్యార్థులు.. తల్లిదండ్రులను పూజించే ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను గుర్తు చేసేలా.. మాతృ పితృ పూజన్​ దివస్​ (తల్లిదండ్రుల పూజోత్సవం) జరపనున్నట్లు స్పష్టం చేశారు జిల్లా విద్యాశాఖాధికారి. ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు​ జారీ చేశారు.

ఇంకా ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో కొన్ని మార్గదర్శకాలు కూడా అందించారు. ఆయా పాఠశాలల్లో 5 నుంచి 10 తల్లిదండ్రుల జంటలను ఆహ్వానించి.. వారి పిల్లలతో సత్కరించాలని స్పష్టం చేశారు. ఈ వేడుకలకు కార్పొరేటర్​, పాఠశాల కమిటీ సభ్యులు, సామాజిక కార్యకర్తలు వంటి ప్రత్యేక అతిథులను ఆహ్వానించవచ్చన్నారు. ఆ రోజు ప్రత్యేకతనూ చాటి చెప్పే విధంగా ప్రసంగాలు ఉండాలని సర్క్యులర్​లో పేర్కొన్నారు.

అవగాహన పెంపొందించాలి...

ఫిబ్రవరి 14న నిర్వహించే ఈ వేడుక ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిసేలా.. ఇలాంటి విభిన్న కార్యక్రమాలను ఏర్పాటుచేసి వారిలో అవగాహన పెంచేలా చేయాలన్నారు సూరత్​ డీఈఓ.

కార్యక్రమ సంబంధిత వివరాలు, ఛాయాచిత్రాలతో కూడిన నివేదికను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాల్సిందిగా స్పష్టం చేశారు.

అయితే.. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది విపక్ష కాంగ్రెస్​. విద్యా ప్రమాణాల్ని మెరుగుపర్చకుండా.. లోపాల్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు ఆ పార్టీ ప్రతినిధి మనీశ్​ దోషీ.

Last Updated : Feb 29, 2020, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details