తెలంగాణ

telangana

ఒడిశాలో 3 రోజులుగా కరోనా కేసులు '0​'

By

Published : Apr 18, 2020, 12:10 PM IST

ఒడిశాలో గడిచిన మూడు రోజుల్లో ఒక్క కరోనా పాజిటివ్​ కేసు కూడా నమోదు కాలేదు. గత 72 గంటల్లో దాదాపు వెయ్యి మందినిపైగా పరీక్షించగా.. వారందరికీ నెగటివ్​గా వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.

Odissa reported Zero cases in past 72 hours
ఒడిశాలో మూడు రోజులుగా కరోనా కేసులు 'సున్నా​'

కరోనా వైరస్​ వ్యాప్తి నుంచి ఒడిశాకు కాస్త ఉపశమనం కలిగింది. గడిచిన 72 గంటల్లో రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. గత మూడు రోజుల్లో 1,042 శాంపిల్స్​ను పరీక్షించగా వీరందరికీ కరోనా నెగటివ్​గా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

భువనేశ్వర్​లో మరో ఇద్దరు వైరస్​ నుంచి కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారు. ఫలితంగా రాష్ట్రంలో వైరస్​ నుంచి కోలుకున్నవారి సంఖ్య 21కి పెరిగింది. ఒడిశాలో ప్రస్తుతం 38 కరోనా యాక్టివ్​ కేసులున్నాయి. వీరందరూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details