తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఔరా: అగ్గిపుల్లలతో జగన్నాథుడి కళాకృతి - ఒడిశా

ఒడిశాలోని పూరీలో జరిగిన నాగార్జున బేషా ఉత్సవాల్లో ఓ కళాకారుడు రూపొందించిన అగ్గిపుల్లల జగన్నాథుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. 11 రోజుల పాటు శ్రమించి సుమారు మూడున్నరవేల అగ్గిపుల్లలతో దీనిని తయారు చేశాడు.

an idol of Lord Jagannath with matchsticks
అగ్గిపుల్లలతో జగన్నాథుడి కళాకృతి

By

Published : Nov 29, 2020, 7:30 AM IST

ఒడిశా పూరీలో 26 ఏళ్ల తర్వాత శనివారం భగవాన్​ జగన్నాథుడి నాగార్జున బేషా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాకారులు వివిధ రూపాల్లో జగన్నాథుడి విగ్రహాలు తయారు చేసి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో పూరీకి చెందిన సాస్వత్​ రంజన్​ సాహూ అనే కళాకారుడు రూపొందించిన అగ్గిపుల్లల జగన్నాథుడి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షించింది. మూడున్నరవేలకుపైగా అగ్గిపుల్లలతో యుద్ధ వీరుడి రూపంలో జగన్నాథ ప్రభువును తీర్చిదిద్ది ఔరా అనిపించాడు.

అగ్గిపుల్లలతో జగన్నాథుడి కళాకృతి

" జగన్నాథుడి విగ్రహం తయారీకి 3,635 అగ్గిపుల్లలను వినియోగించాను. దానిని పూర్తి చేసేందుకు 11 రోజుల సమయం పట్టింది."

- సాస్వత్​ రంజన్​ సాహూ, కళాకారుడు

జగన్నాథుడి కళాకృతి వద్ద సాస్వత్​ రంజన్​ సాహూ

కార్తీక మాసంలో విష్ణువు మరో అవతారం పరుశరాముడిని కోలుచుకుంటూ జగన్నాథుడిని యుద్ధవీరుడిగా అలంకరించి నాగార్జున బేషా నిర్వహిస్తారు. వెయ్యి చేతులు గల కార్తవీర్యార్జునుడ్ని పరుశురాముడు అంతమొందించినందుకు గుర్తుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని అక్కడి ప్రజలు చెబుతారు. అలాగే ఆర్జునుడు, అతని కుమారుడు నాగార్జునుడి మధ్య యుద్ధానికి గుర్తుగా చేస్తారని మరికొందరు చెప్తారు. ఈ సందర్భంగా 16 రకాల ఆయుధాలతో జగన్నాథుడిని అలంకరిస్తారు.

ఇదీ చూడండి:గణేశుడికి ఆ తల ఎలా వచ్చింది?

ABOUT THE AUTHOR

...view details