ఒడిశా బెర్హంపుర్కు చెందిన ఓ జంట.. తమ పెళ్లితో నలుగురికి ఆదర్శంగా నిలవాలనే ఆలోచించి.. వివాహంలో ఆచరించి చూపించింది.
నగరానికి చెందిన బిప్లబ్ కుమార్-అనిత వివాహం మంగళవారం జరిగింది. ఇందులో కొత్తేమి ఉందనుకుంటున్నారా..? నవదంపతులు భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఒక్కటయ్యారు. వివాహ వేదికపై బంధుమిత్రుల సమక్షంలో రాజ్యాంగ ప్రతులను చేతిలో పట్టుకుని ప్రమాణం చేశారు.
అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో నవదంపతులతో పాటు వివాహానికి హాజరైన బంధువులూ పాలుపంచుకున్నారు.