తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆదర్శ' వివాహం: రాజ్యాంగం సాక్షిగా ఒక్కటైన జంట - latest news on odisha

సాధారణంగా పెళ్లిళ్లు వారి వారి మతాల ప్రకారం సంప్రదాయ పద్ధతిలో జరుగుతాయి. కానీ ఒడిశా బెర్హంపుర్​కు చెందిన ఓ జంట వినూత్న ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. ఆదర్శంగానూ నిలిచింది. మరి ఆ జంట చేసిన ఆలోచనేంటో తెలుసుకుందాం.

రాజ్యాంగం సాక్షిగా ఒక్కటైన జంట

By

Published : Oct 23, 2019, 12:08 PM IST

Updated : Oct 23, 2019, 2:25 PM IST

'ఆదర్శ' వివాహం: రాజ్యాంగం సాక్షిగా ఒక్కటైన జంట

ఒడిశా బెర్హంపుర్​కు చెందిన ఓ జంట.. తమ పెళ్లితో నలుగురికి ఆదర్శంగా నిలవాలనే ఆలోచించి.. వివాహంలో ఆచరించి చూపించింది.

నగరానికి చెందిన బిప్లబ్​ కుమార్​-అనిత వివాహం మంగళవారం జరిగింది. ఇందులో కొత్తేమి ఉందనుకుంటున్నారా..? నవదంపతులు భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఒక్కటయ్యారు. వివాహ వేదికపై బంధుమిత్రుల సమక్షంలో రాజ్యాంగ ప్రతులను చేతిలో పట్టుకుని ప్రమాణం చేశారు.

అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో నవదంపతులతో పాటు వివాహానికి హాజరైన బంధువులూ పాలుపంచుకున్నారు.

ప్రతి ఒక్కరు వరకట్నానికి దూరంగా ఉండి.. నిరాడంబర పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించారు బిప్లబ్​ కుమార్​. ఇలాంటి వివాహాలు ఎలాంటి బాణసంచా మోతలు లేకుండా పర్యావరణ హితంగా ఉంటాయన్నారు.

తన కొత్త జీవితాన్ని సరికొత్త పద్ధతిలో ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు అనిత. ఇలాంటి పెళ్లిళ్లు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు.

ఇదీ చూడండి: ఉల్లాసంగా- ఉత్సాహంగా గజరాజుల 'ఫుట్​బాల్​'

Last Updated : Oct 23, 2019, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details