తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లారీ యజమానికి రూ.6.53 లక్షలు జరిమానా

ట్రాఫిక్​ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఓ లారీ యజమానికి రూ.6,53,100 జరిమానా విధించారు అధికారులు. ఈ ఘటన ఈనెల 10న ఒడిశా సంబల్​పుర్​లో జరిగింది.

By

Published : Sep 14, 2019, 6:29 PM IST

Updated : Sep 30, 2019, 2:42 PM IST

లారీ యజమానికి రూ.6.53 లక్షలు జరిమానా

మోటారు వాహనాల చట్టం-2019 అమలుతో ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘించేవారికి జరిమానాల మోత మోగుతోంది. తాజాగా ఒడిశాలో ఓ లారీ యజమానికి ఏకంగా రూ.6,53,100 చలానా వేశారు పోలీసులు.

లారీ యజమానికి రూ.6.53 లక్షలు జరిమానా

నాగాలాండ్​కు చెందిన లారీ సంబల్​పుర్​కు వచ్చిన క్రమంలో ఈనెల 10న ట్రాఫిక్​ అధికారులు తనిఖీ చేశారు. గాలి, ధ్వని కాలుష్యం, ఎలాంటి అనుమతులు లేకుండా వస్తు రవాణా వాహనంలో ప్రయాణికులను తరలించటం, వాహన బీమా లేకపోవటం, 2014 జులై నుంచి సెప్టెంబర్​ 2019 వరకు పన్నులు చెల్లించకపోవటం వల్ల ఈ మేరకు భారీ జరిమానా విధించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:రూ.70వేల కోట్ల ప్యాకేజీతో ఎగుమతులు, స్థిరాస్తికి ఊతం

Last Updated : Sep 30, 2019, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details