కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన కేంద్రం.. సడలింపులు చేస్తోంది. విమాన ప్రయాణాలపై ఒప్పందం(ఎయిర్ బబుల్స్ సదుపాయాలు) చేసుకున్న అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుదారులు భారత్లో పర్యటించేందుకు అనుమతించింది.
ఆ దేశాలకు చెందిన ఇతరులకు కూడా వ్యాపార, వైద్య, ఉద్యోగ అవసరాలకు భారత వీసాలు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన జారీ చేసింది. అలాగే భారత పౌరులు కూడా ఆయా దేశాలకు ఎలాంటి వీసాపైనైనా ప్రయాణాలు చేయొచ్చని తెలిపింది.
కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న వేళ.. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలతో ద్వైపాక్షిక వాయుమార్గ సదుపాయాలు/ఎయిర్ బబుల్స్ ఒప్పందాలు చేసుకుంది భారత్. ఈ పథకంలో త్వరలోనే మరిన్ని దేశాలను చేర్చనున్నట్లు హోంశాఖ తెలిపింది.