తెలంగాణ

telangana

By

Published : Apr 8, 2019, 5:20 PM IST

Updated : Apr 8, 2019, 5:52 PM IST

ETV Bharat / bharat

కాంగ్రెస్​ ప్రధాన అస్త్రం 'న్యాయ్​':రాహుల్

లోక్​సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. 'న్యాయ్' పథకాన్ని ప్రధాన ప్రచారాంశంగా చేసుకొని ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ప్రజలకిచ్చిన హామీలపై విస్తృత ప్రచారం చేస్తోంది.

కాంగ్రెస్​ ప్రధాన అస్త్రం 'న్యాయ్​':రాహుల్

కాంగ్రెస్​ ప్రధాన అస్త్రం 'న్యాయ్​':రాహుల్

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో 'న్యాయ్​' (కనీస ఆదాయ పథకం) తమ ప్రధాన ప్రచార అస్త్రమని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పక నిలబెట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్​ ఆదివారం 'అబ్​ హోగా న్యాయ్​' (ఇప్పుడు న్యాయం జరుగుతుంది) అంటూ పార్టీ ఎన్నికల నినాదాన్ని ప్రకటించింది. భాజపా ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయానికి బదులుగా పేదలందరికీ 'కనీస ఆదాయ పథకం (న్యాయ్​) ద్వారా న్యాయం చేస్తామని కాంగ్రెస్​ పార్టీ తెలిపింది.

కాంగ్రెస్ ప్రచార వీడియోను సామాజిక మాధ్యమాల్లో అందరికీ షేర్ చేయాలని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ.. ట్విట్టర్​ వేదికగా ప్రజలను కోరారు.

"కనీస ఆదాయ పథకం 'న్యాయ్​' ప్రధాన అంశంగా కాంగ్రెస్​, జాతీయ ప్రసారమాధ్యమాల్లో, మల్టీమీడియా వేదికల్లో ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్​ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల ఆధారంగా ఈ ప్రచారం కొనసాగుతుంది."-రాహుల్​గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు, ట్వీట్

కాంగ్రెస్​ ప్రచార గీతం..

కాంగ్రెస్​ ఎన్నికల ప్రచారం కోసం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించింది. 'మైన్​ హీ తో హిందుస్థాన్ హూన్' (నేను భారతీయుడిని) అనే ఈ ప్రచార గీతాన్ని జావెద్​ అఖ్తర్​​ రచించారు. ఈ గీతాన్ని నిఖిల్​ అడ్వాణీ దర్శకత్వంలో చిత్రీకరించారు.

ఈ ప్రచార గీతంలో కాంగ్రెస్​ వాగ్దానం చేసిన న్యాయ్​ పథకం, పేదరిక నిర్మూలన, యువతకు ఉద్యోగాలు, రైతుల సమస్యలు, మహిళా రిజర్వేషన్లు, జీఎస్టీ సరళీకరణ, విద్య, ఆరోగ్య సంక్షేమ పథకాలు, అంకుర సంస్థలకు ప్రోత్సాహం వంటి అంశాలు చేర్చారు. మరోవైపు కొన్ని వేల కంటైనర్​ ట్రక్కులపై యాడ్​లతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ ఎన్నికల ప్రచారం చేస్తోంది.

ఇదీ చూడండి: 'రామ మందిర నిర్మాణం- సంక్షేమ భారతం'

Last Updated : Apr 8, 2019, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details