తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"న్యాయ్​ హామీతో భాజపాలో అయోమయం" - కాంగ్రెస్​ పార్టీ

న్యాయ్​ పథకం ప్రకటనతో భారతీయ జనతా పార్టీ గందరగోళంలో పడిందని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ పీటీఐకి ఇచ్చిన ముఖాముఖిలో వ్యాఖ్యానించారు. న్యాయ్​ పథకం ప్రజాకర్షకం కాదని, పేదరిక నిర్మూలనకు ఉద్దేశించినదని స్పష్టంచేశారు.

"న్యాయ్​ హామీతో భాజపాలో అయోమయం"

By

Published : Mar 28, 2019, 3:33 PM IST

అధికారంలోకి వచ్చాక కనీసం ఆదాయ పథకం న్యాయ్​( న్యూన్​తమ్​ ఆయ్​ యోజన)ను అమలుచేస్తామని ఇటీవల చేసిన ప్రకటనతో భారతీయ జనతా పార్టీలో అయోమయం నెలకొందని కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు విమర్శించారు. న్యాయ్​ పథకం ప్రజాకర్షకం కాదని పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో వ్యాఖ్యానించారు.

న్యాయ్​ పథకంపై రాహుల్​ గాంధీ వ్యాఖ్యలు కొన్ని...

  • మోదీ చేసిన నోట్ల రద్దుకు పూర్తి వ్యతిరేక దిశగా ఈ పథకం పనిచేస్తుంది.
  • న్యాయ్​ పథకం 20 శాతం ప్రజలకు నగదు ఇవ్వటమే కాక దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతుంది. పేదలకు ఈ పథకం ద్వారా న్యాయం చేయాలనుకుంటున్నాం.
  • ఎన్డీఏ హయాంలో మోదీ లాగేసుకున్న దానిని మళ్లీ పేదలకు ఇవ్వాలనుకుంటున్నాం.
  • మోదీ తన పనిని సరిగా చేసి ఉంటే ఇప్పటికే పేదరికం అంతరించిపోయేది.
  • న్యాయ్​ పథకం ఒక మైలు రాయిలాంటిది. అమలు చేయదగ్గ పథకం, దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి భారం పడదు.
  • ఇది అసలు ప్రజాకర్షకమే కాదు. పేదరికం నిర్మూలించే అతిపెద్ద పథకం.
  • ఎన్డీఏ అమలు చేసిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), నోట్ల రద్దులా కఠినంగా అమలు చేయం.
  • న్యాయ్​ పథకం వల్ల ఉత్పత్తి, వినియోగం రెండూ పెరుగుతాయి.

ABOUT THE AUTHOR

...view details