భారత్లో కరోనా మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 415కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఆదివారం రాత్రి(360) నుంచి ఇప్పటి వరకు కేసుల సంఖ్య పెరిగిన తీరు ఆందోళన కలిగిస్తోంది.
వైరస్ సోకినవారిలో 41మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. కరోనా కారణంగా ఇప్పటివరకు ఏడుగురు మరణించారని ప్రకటించింది. 24 మంది పూర్తిగా కోలుకున్నట్లు స్పష్టం చేసింది.
సోమవారం ఉదయం 10గంటలవరకు 18వేల 383 నమూనాలను పరీక్షించినట్టు తెలిపంది భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది.