తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సరిహద్దుపై తుది తీర్మానం వరకూ ప్రశాంతంగా ఉందాం' - NSA Doval and Chinese Foreign Minister Wang hold boundary talks

దశాబ్దాలుగా నలుగుతున్న భారత్​-చైనా సరిహద్దు వివాదంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమావేశమయ్యారు. 3500 కిలోమీటర్ల భారత్-చైనా సరిహద్దు వెంట శాంతి నెలకొల్పే దిశగా ప్రత్యేక ప్రతినిధులిద్దరూ చర్చించినట్లు సమాచారం. సరిహద్దు అంశమై తుది తీర్మానం వెలువడే వరకు శాంతిని పాటించాలని ప్రతినిధులు ఉద్ఘాటించారు.

dobal
'సరిహద్దుపై తుది తీర్మానం వరకు ప్రశాంతంగా ఉందాం'

By

Published : Dec 21, 2019, 5:09 PM IST

భారత్​-చైనా సరిహద్దు అంశమై ప్రత్యేక ప్రతినిధులైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ దిల్లీలో సమావేశమయ్యారు. 3500 కిలోమీటర్ల మేర ఉన్న భారత్-చైనా సరిహద్దుపై గల భేదాభిప్రాయలపై చర్చించారు. సరిహద్దులో శాంతి నెలకొనే దిశగా పలు అంశాలపై ప్రతినిధులు చర్చించారని సమాచారం. సరిహద్దు సమస్యపై తుది తీర్మానం పెండింగ్​లో ఉన్నందున ఇరు దేశాలు సరిహద్దు వెంబడి ప్రశాంతంగా ఉండాలని ప్రతినిధులు ఆకాంక్షించారు.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్ మధ్య తమిళనాడు మహాబలిపురం వేదికగా రెండో అనధికారిక సమావేశం అనంతరం ఇరుదేశాల ప్రతినిధులు భేటీ కావడం ఇదే తొలిసారి.

అయితే సరిహద్దు అంశమై ప్రత్యేక ప్రతినిధుల సమావేశానికి వాంగ్​యీ గత సెప్టెంబర్​లోనే భారత్​ను సందర్శించినప్పటికీ ఆ సమయంలో చర్చలు వాయిదా పడ్డాయి. గతంలో 21 దఫాల పాటు సరిహద్దు అంశమై ప్రత్యేక ప్రతినిధుల సమావేశం జరిగింది. వాస్తవాధీన రేఖ వెంబడి గల ఇండో-చైనా సరిహద్దు అంశమై ఇరుదేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్​లో భాగమని డ్రాగన్ దేశం వాదిస్తోండగా.. భారత్ తమ భూభాగమేనని ఉద్ఘాటిస్తూ వస్తోంది.

ఇదీ చూడండి: మరోసారి పాక్ దుశ్చర్య.. ఇద్దరు దాయాది సైనికులు హతం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details