తెలంగాణ

telangana

By

Published : Mar 25, 2020, 5:13 PM IST

ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: జనాభా లెక్కలు వాయిదా

జాతీయ జనాభా పట్టిక, 2021 జనగణన తొలిదశ ప్రక్రియలపై కరోనా ప్రభావం పడింది. దేశం 21 రోజులపాటు లాక్​డౌన్​లో ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలను ఎప్పుడు నిర్వహిస్తారనేది ప్రభుత్వం స్పష్టం చేయలేదు.

npr-first-phase-of-census-postponed
కరోనా ఎఫెక్ట్​: ఎన్​పీఆర్​, సెన్సెస్​ వాయిదా

దేశంలో 21 రోజుల లాక్​డౌన్​ కారణంగా.. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్​), 2021 సెన్సెస్​(జనగణన) తొలి దశ ప్రక్రియలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని కేంద్ర హోమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

నిజానికి ఈ ప్రక్రియలు ఏప్రిల్​ 1- సెప్టెంబర్​ 30లోపు జరగాల్సి ఉంది. కానీ దేశంలో కరోనా విజృంభిస్తుండటం వల్ల వాయిదా వేయక తప్పలేదు. అయితే వీటిని మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయాన్ని హోంశాఖ వెల్లడించలేదు.

"ఏప్రిల్​-సెప్టెంబర్​ మధ్య కాలంలో 2021 జనగణన రెండు దఫాలు(ఇళ్ల జాబితా- ఇళ్ల గణన)గా నిర్వహించాల్సి ఉంది. జనాభా గణన వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి 28వరకు జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు హై అలర్ట్​ ప్రకటించాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని 2021 సెన్సెస్​ తొలి దశ, ఎన్​పీఆర్​ ప్రక్రియలు.. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వాయిదా వేస్తున్నాం."

--- కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటన

ఈ ప్రక్రియల్లో భాగంగా అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో ప్రమాదకరమని.. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఓ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి:-ఎంపీల నిధులతో అవి కొనేందుకు కేంద్రం ఓకే

ABOUT THE AUTHOR

...view details