'అయోధ్య కేసులో మధ్యవర్తిత్వంతో గందరగోళం' అయోధ్య రామమందిరం కేసుపై విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) స్పందించింది. మధ్యవర్తిత్వాన్ని పునరుద్ధరించడం గందరగోళానికి దారితీస్తుందని అభిప్రాయపడింది. ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వేచిచూడాలని హిందూ పక్షాలకు సూచించింది వీహెచ్పీ. మధ్యవర్తిత్వానికి సంబంధించి తమనెవరూ సంప్రదించలేదని వెల్లడించింది.
''అయోధ్య కేసులో సుప్రీం కోర్టు 40 రోజులు, 200 గంటలకుపైగా విచారణ జరిపింది. వాదనలు ముగిశాయి. కేసు తుది దశకు వచ్చిన సమయంలో మధ్యవర్తిత్వాన్ని పునరుద్ధరించడం గందరగోళానికి దారితీస్తుంది.''
- వీహెచ్పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆలోక్ కుమార్
సున్నీ వక్ఫ్ బోర్డు ఈ వ్యవహారంలో సెటిల్మెంట్ కోసం ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీహెచ్పీ ఈ వ్యాఖ్యలు చేసింది.
అయోధ్య కేసు పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైందని.. ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం... అక్టోబర్ 16న వాదనలు ముగించింది. అదే రోజు సయోధ్య యత్నాలపై కమిటీ.. సుప్రీం కోర్టుకు తమ రెండో నివేదిక అందించింది. నవంబర్ తొలి వారంలో తీర్పు వెల్లడయ్యే అవకాశముంది.