తెలంగాణ

telangana

By

Published : Nov 29, 2019, 5:46 AM IST

Updated : Nov 29, 2019, 8:23 AM IST

ETV Bharat / bharat

పాత కేసులు, కొత్త ఇంటి వేటతో ఫడణవీస్​కు చిక్కులు

ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగగానే దేవేంద్ర ఫడణవీస్​కు చిక్కులు మొదలయ్యాయి. పాత కేసుకు సంబంధించి నాగ్​పుర్​ స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. మరోవైపు ముంబయిలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉండగా.. కొత్త ఇంటి వేటలో నిమగ్నమయ్యారు ఫడణవీస్.

MH-FADNAVIS-SUMMONS
MH-FADNAVIS-SUMMONS

పాత కేసులు, కొత్త ఇంటి వేటతో ఫడణవీస్​కు చిక్కులు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​కు కొత్త చిక్కులు మొదలయ్యాయి. పాత కేసులకు సంబంధించి నాగ్​పుర్ కోర్టు ఆదేశాలతో​ పోలీసులు సమన్లు జారీ చేశారు. మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజే ఈ సమన్లు జారీ కావటం గమనార్హం.

2014 ఎన్నికల నాటి అఫిడవిట్​లో తనపై పెండింగ్​లో ఉన్న రెండు క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదని ఆయనపై న్యాయవాది సతీశ్ వ్యాజ్యం దాఖలుచేశారు. ఈ విషయంలో ముంబై హైకోర్టులో ఫడణవీస్​కు ఊరట లభించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు సతీశ్.

సుప్రీం కోర్టు ఆదేశాలతో...

ముంబయి హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ వ్యాజ్యాన్ని పునఃపరిశీలనకు తీసుకోవాలని విచారణ కోర్టును 2019 అక్టోబర్​ 1న ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలో తాజాగా సమన్లు జారీ చేసింది నాగ్​పుర్​ కోర్టు.

ఫడణవీస్​పై 1996లో మోసపూరిత నేరం, 1998లో ఫోర్జరీ కేసు నమోదయ్యాయి. ఈ వివరాలను ఆయన 2014 ప్రమాణ పత్రంలో పొందుపరచలేదు.

కొత్త ఇంటి వేటలో..

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత దక్షిణ ముంబయిలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్నారు ఫడణవీస్​. ఆయన​ స్వస్థలం నాగ్​పుర్​. ఫడణవీస్ భార్య అమృత ముంబయిలోనే ఓ ప్రముఖ బ్యాంకులో పనిచేస్తున్నారు. కుమార్తె కూడా అక్కడే చదువుతోంది. ఈ కారణాలతో ముంబయిలో ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కొత్త ఇంటి వేటలో ఉన్నారాయన.

ఇదీ చూడండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేనాని 'ఠాక్రే'

Last Updated : Nov 29, 2019, 8:23 AM IST

ABOUT THE AUTHOR

...view details