తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భవిష్యత్​ ప్రయోగాలపై ఆ ప్రభావం ఉండదు: ఇస్రో

భవిష్యత్​ ప్రయోగాలపై చంద్రయాన్​-2 ప్రభావం ఉండదని ఇస్రో వెల్లడించింది. ప్రతిష్ఠాత్మక మానవసహిత గగన్​యాన్​ మిషన్​ను ప్రణాళిక ప్రకారం 2022లో ప్రయోగించనున్నట్టు స్పష్టం చేసింది. ఒక మిషన్​తో మరో దానికి పొంతన ఉండదని, దేనికదే ప్రత్యేకమని తెలిపింది.

By

Published : Sep 8, 2019, 5:15 AM IST

Updated : Sep 29, 2019, 8:29 PM IST

భవిష్యత్​ ప్రయోగాలపై ఆ ప్రభావం ఉండదు: ఇస్రో

భారత్​ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మానవసహిత మిషన్​ గగన్​యాన్​ సహా భవిష్యత్​ ప్రయోగాలపై చంద్రయాన్​-2 ప్రభావం ఉండదని ఇస్రో స్పష్టం చేసింది. ప్రణాళిక ప్రకారమే 2022లో గగన్​యాన్​ ప్రయోగం ఉంటుందని ఇస్రో అధికారి తెలిపారు.

చంద్రయాన్​, గగన్​యాన్​ లక్ష్యాలు వేరువేరని భూ పర్యవేక్షణ-విపత్తు నిర్వహణ విభాగ డైరెక్టర్​ పీజీ దివాకర్​ వెల్లడించారు.

"అసలు సమస్యే ఉండదు. ఇతర ప్రయోగాలపై చంద్రయాన్-2 ప్రభావం ఉండదు. ఉపగ్రహాల ప్రయోగంతో పాటు గగన్​యాన్​ మిషన్​ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది. ప్రతి మిషన్​ ఎంతో ప్రత్యేకమైనది.​"
--- పీజీ దివాకర్​, ఇస్రో అధికారి.

2022 కల్లా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత తొలి సౌర మిషన్​ 'ఆదిత్య ఎల్​-1'ను వచ్చే ఏడాది ఇస్రో ప్రయోగించనుంది.

వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి.. సురక్షితంగా భూమికి తీసుకురావడమే ఈ గగన్​యాన్​ ముఖ్య లక్ష్యం.

ఇదీ చూడండి- 'విక్రమ్' కోసం మరో 14 రోజులు అన్వేషణ​ : శివన్​

Last Updated : Sep 29, 2019, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details