మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. శివసేన 50-50 ఫార్ములాపై పట్టు వీడని నేపథ్యంలో కేంద్ర మంత్రి, భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీ స్పందించారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో భాజపా-శివసేన మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగలేదని స్పష్టం చేశారు.
'భాజపా- శివసేన మధ్య ముఖ్యమంత్రి పదవిని పంచుకునే విషయంలో ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. దివంగత నేత బాల్ ఠాక్రే ఉన్నప్పుడూ ఇరు పార్టీల మధ్య ఎన్నికల సమయంలో శాసనసభ్యుల సీట్ల మధ్య మాత్రమే ఒప్పందం జరిగేవి.. ముఖ్యమంత్రి పదవి కోసం కాదు'
- నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి.