బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి నేడు దిల్లీకి వెళ్లట్లేదని ఒక ప్రకటన విడుదల చేసింది పార్టీ. ఎగ్జిట్ పోల్స్ అనంతరం దిల్లీలో విపక్షాలతో భేటీ అవుతారని వచ్చిన వార్తలపై ఈమేరకు స్పష్టత ఇచ్చింది బీఎస్పీ.
'దిల్లీలో మాయావతి నేడు ఎలాంటి కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించట్లేరు. ఆమె లఖ్నవూలోనే ఉంటారు.'
- సతీశ్ చంద్ర మిశ్ర, బీఎస్పీ సీనియర్ నేత
మే 23న లోక్సభ ఫలితాలు రానున్న నేపథ్యంలో.. మాయావతి దిల్లీలో యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం అవుతారని కొన్ని మీడియాల్లో వార్తలొచ్చాయి. ఈ ఊహాగానాలను కల్పితమే అని కొట్టిపారేసింది పార్టీ.