తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దిల్లీకి దూరంగా మాయ- లఖ్​నవూకే పరిమితం'

బహుజన్​ సమాజ్​ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి.. విపక్షాలతో దిల్లీలో నేడు ఎలాంటి సమావేశాలు నిర్వహించట్లేరని స్పష్టం చేసింది పార్టీ. మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని ప్రకటించింది.

By

Published : May 20, 2019, 9:49 AM IST

Updated : May 20, 2019, 10:45 AM IST

మాయావతి లఖ్​నవూలోనే ఉంటారు

లఖ్​నవూలోనే మాయావతి... దిల్లీకి వెళ్లట్లేరు

బహుజన్​ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి నేడు దిల్లీకి వెళ్లట్లేదని ఒక ప్రకటన విడుదల చేసింది పార్టీ. ఎగ్జిట్ పోల్స్​ అనంతరం దిల్లీలో విపక్షాలతో భేటీ అవుతారని వచ్చిన వార్తలపై ఈమేరకు స్పష్టత ఇచ్చింది బీఎస్పీ.

'దిల్లీలో మాయావతి నేడు ఎలాంటి కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించట్లేరు. ఆమె లఖ్​నవూలోనే ఉంటారు.'

- సతీశ్​ చంద్ర మిశ్ర, బీఎస్పీ సీనియర్​ నేత

మే 23న లోక్​సభ ఫలితాలు రానున్న నేపథ్యంలో.. మాయావతి దిల్లీలో యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీతో సమావేశం అవుతారని కొన్ని మీడియాల్లో వార్తలొచ్చాయి. ఈ ఊహాగానాలను కల్పితమే అని కొట్టిపారేసింది పార్టీ.

ఎన్నికల తదనంతర పరిణామాలపై ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మాయావతిని లఖ్​నవూలో శనివారం ఉదయం కలిశారు.

మే 19తో సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ ముగిసింది. అనంతరం వెలువడిన ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు.. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏనే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి.

ఎన్నికల్లో ఒకవేళ ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోతే... ప్రభుత్వ ఏర్పాటులో ఎస్పీ-బీఎస్పీ కూటమి కీలక పాత్ర పోషించే అవకాశముంది.

ఇదీ చూడండి:

కీలక రాష్ట్రాల్లో భాజపాదే పైచేయి : ఎగ్జిట్​ పోల్స్​

Last Updated : May 20, 2019, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details