తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాంకేతికతతోనే అభివృద్ధి సాధ్యం: మోదీ - pm modi on science

దేశం ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు శాస్త్రసాంకేతికత ఎంతో అవసరమన్నారు ప్రధాని మోదీ. కోల్​కతా వేదికగా జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్​ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రధాని ప్రసంగించారు.

సాంకేతికతతోనే అభివృద్ధి సాధ్యం: మోదీ

By

Published : Nov 5, 2019, 6:20 PM IST

Updated : Nov 5, 2019, 7:39 PM IST

సాంకేతికతతోనే అభివృద్ధి సాధ్యం: మోదీ

శాస్త్రవిజ్ఞానం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కోల్​కతా వేదికగా జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్​ ఫెస్టివల్​ను ఉద్దేశించి దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

"శాస్త్ర, సాంకేతికత లేకుండా అభివృద్ధి సాధించిన దేశం ప్రపంచంలో ఏదీ లేదు. శాస్త్రవిజ్ఞానంలో భారత్ ఎంతో సాధించింది. మనం ప్రపంచానికి అత్యుత్తమ శాస్త్రవేత్తలను అందించాం. మన చరిత్ర ఎంతో గౌరవం అందుకుంది. వర్తమానం శాస్త్ర సాంకేతికతతో నిండినది. భవిష్యత్తు కోసం మన బాధ్యత ఎంతో పెరిగింది. ఈ బాధ్యతలు ఎంతో గౌరవమైనవి. వీటిని నిర్వర్తించేందుకు శాస్త్ర సాంకేతికతతో ముందుకు సాగాల్సి ఉంది. ప్రభుత్వం నవ కల్పనలు, నవీన ఉత్పత్తుల తయారీకి వ్యవస్థాగతమైన సహకారం అందిస్తోంది. దేశంలో శాస్త్ర,సాంకేతిక రంగం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన వాతావరణం ఎంతో ప్రభావమంతమైనదే కాక.. పేద ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలి."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

చంద్రయాన్-2 ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు విశేష కృషి చేశారని కొనియాడారు మోదీ. నిర్దేశిత లక్ష్యాన్ని నెరవేర్చకపోయినా అది విజయవంతమైన ప్రయోగమేనని చెప్పారు. విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తి పెంచేందుకు చంద్రయాన్​-2 ఎంతో ఉపకరించిందన్నారు ప్రధాని.

ఇదీ చూడండి: 'గడ్కరీ ఉంటే మహా ప్రతిష్టంభనకు రెండు గంటల్లో తెర'

Last Updated : Nov 5, 2019, 7:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details