తెలంగాణ

telangana

'జేడీయూను మేం మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాం'

By

Published : Oct 15, 2020, 9:27 PM IST

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిహార్​లో రాజకీయ వేడి రాజుకుంది. జేడీయూతో విబేధాలతో ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగిన ఎల్​జేపీ అధినేత చిరాగ్​ పాసవాన్​.. సీఎం నితీశ్​ కుమార్​ లక్ష్యంగా విమర్శలు చేశారు. తన తండ్రి రాంవిలాస్​ పాసవాన్​ను నితీశ్ తీవ్రంగా అవమానపరిచారని ఆరోపించారు చిరాగ్​. అందుకోసమే ఆది నుంచి తాము జేడీయూను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

Nitish behaved with my father haughtily, worked to defeat LJP nominees in LS polls: Chirag
'జేడీయూను మేం మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాం'

జేడీయూతో విబేధాల కారణంగా ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చిన ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్​.. సీఎం నితీశ్‌ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి రాంవిలాస్‌ పాసవాన్​ను నితీశ్‌ అవమానించారని, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని మరిచి తమ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని విమర్శించారు. తాము మొదటి నుంచీ నితీశ్‌ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నామని, అందుకే కూటమి నుంచి బయటకొచ్చినట్లు చెప్పారు చిరాగ్​. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడిన చిరాగ్​.. ఈ మేరకు నితీశ్​ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

ఇంకా ఏమన్నారంటే?

"జేడీయూను మేం మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాం. ఎన్డీఏను రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అనివార్యంగా జేడీయూతో కలిసి 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆయన కూటమి ధర్మాన్ని మరిచి ఎల్జేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారు. జేడీయూ మద్దతుతోనే రాంవిలాస్‌ పాసవాన్​ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికయ్యారని నితీశ్‌ చెప్పుకొచ్చారు. వాస్తవం ఏంటంటే మా నాన్నకు రాజ్యసభ సీటు ఇవ్వడానికి అప్పటి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హామీ ఇచ్చారు. రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు మా నాన్న.. నితీశ్‌ను ఆహ్వానిస్తే ఆయన తన అహంకారాన్ని ప్రదర్శించారు. నామినేషన్‌ ముహూర్తం పూర్తయ్యాక తీరిగ్గా వచ్చారు. ఏ కొడుకూ తన తండ్రికి జరిగిన ఇలాంటి అవమానాల్ని సహించలేడు."

"ఆయన దళితులకు అన్యాయం చేస్తూ తన రాజకీయ లబ్ధి కోసం మహా దళితులు అనే ఉప కులాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఈయన(నితీశ్​) మాత్రం.. కుళాయిలు, కాంక్రీట్‌ రోడ్లు అంటూ హామీలు ఇస్తున్నారు. మరోవైపు అవినీతి, నేరాలు, మతపరమైన విద్వేషాలు ఎంత మాత్రం సహించబోనని సీఎం చెప్పేవన్నీ ఉత్తిమాటలే." అని చిరాగ్‌ విమర్శించారు.

'ప్రతి పథకంలోనూ అవినీతే'

రాష్ట్రంలో అమలయ్యే ప్రతి పథకాన్ని తరచి చూస్తే అవినీతి కనిపిస్తుందని చెప్పారు. ఇటీవల బక్సార్‌ జిల్లాలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి సజీవంగా దహనం చేయడం రాష్ట్రంలోని పరిస్థితికి నిదర్శనమన్నారు. ఆర్జేడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బిహార్‌ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతుందని నిత్యానంద్‌ రాయ్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం నీతీశ్‌ ఏం చెబుతారు? అని ప్రశ్నించారు చిరాగ్‌.

ఇదీ చదవండి:బిహార్ బరి​: అప్పుడు తండ్రులతో- ఇప్పుడు తనయులతో

ABOUT THE AUTHOR

...view details