తెలంగాణ

telangana

By

Published : Aug 3, 2019, 7:50 PM IST

Updated : Aug 3, 2019, 9:33 PM IST

ETV Bharat / bharat

ఆపరేషన్​ కశ్మీర్​: శ్రీనగర్​ 'నిట్'​ ఖాళీ

కశ్మీర్​లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్​లోని హజ్రత్​బిల్​ నిట్​ క్యాంపస్​కు సెలవులు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తరగతులు కొనసాగవని నిట్​ రిజిస్ట్రార్​ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆపరేషన్​ కశ్మీర్

శ్రీనగర్​ 'నిట్'​ ఖాళీ

జమ్ము కశ్మీర్​లోని​ హజ్రత్​బిల్​ నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీకి సెలవులు ఇస్తున్నట్లు సంస్థ​ రిజిస్ట్రార్​ ప్రకటన చేశారు. ఈ రోజు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిట్​లో బోధనా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితంగా... విద్యార్థులంతా స్వస్థలాలకు పయనమయ్యారు.

"నిట్​కు సెలవులు ప్రకటించినట్లు కళాశాల పాలక వర్గం నోటిఫికేషన్​ ఇచ్చింది. ప్రతి విద్యార్థి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. రాష్ట్రేతర విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులను ఉచితంగా ఏర్పాటు చేశారు. తిరిగి తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదు."

- విద్యార్థి, హజ్రత్​ బిల్​ నిట్​

ఖండించిన ప్రభుత్వం

హజ్రత్ బిల్ నిట్​ తరగతులను నిలిపివేసినట్లు వచ్చిన ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. శ్రీనగర్​ డిప్యూటీ కమిషనర్ షాహిద్ చౌదరి ఈ మేరకు ట్విట్టర్​లో ప్రకటన చేశారు. వదంతులను నమ్మవద్దని సూచించారు.

ఇదీ చూడండి: 'ఆపరేషన్​ కశ్మీర్'పై నిఘా వర్గాల సమాచారం ఇదే!

Last Updated : Aug 3, 2019, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details