తెలంగాణ

telangana

By

Published : Jan 20, 2020, 6:40 AM IST

Updated : Jan 20, 2020, 9:02 AM IST

ETV Bharat / bharat

నిర్భయ దోషి పిటిషన్​పై నేడు 'సుప్రీం' విచారణ

నిర్భయ కేసు.. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్​ ​గుప్తా పిటిషన్​పై ఇవాళ విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి.

NIRBHAYA-CASE-SC-TO-HEAR-TODAY CONVICTS-PLEA-AGAINST-HC-ORDER-REJECTING-HIS-JUVENILITY-CLAIM
నేడు నిర్భయ దోషి పిటిషన్​పై సుప్రీంలో విచారణ

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్న వేళ వీరిలో ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

2012 డిసెంబర్​లో నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌ను అంటూ చేసిన వాదనను దిల్లీ హైకోర్టు తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దోషుల్లో ఒకరైన పవన్‌ కుమార్ గుప్తా సుప్రీంకోర్టును ఈ నెల 17న ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యంపై సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్​ ఆర్. భానుమతి, జస్టిస్​ అశోక్​ భూషణ్​​, జస్టిస్​ ఏఎస్​ బోపన్నలతో కూడిన ధర్మాసనం వాదనలు విననుంది.

ఇదీ చదవండి: క్రికెట్​తో అలరించిన భారత ప్రధాన న్యాయమూర్తి

Last Updated : Jan 20, 2020, 9:02 AM IST

ABOUT THE AUTHOR

...view details