తెలంగాణ

telangana

నిర్భయ దోషి పిటిషన్​పై రేపు సుప్రీం విచారణ

By

Published : Jan 27, 2020, 6:48 PM IST

Updated : Feb 28, 2020, 4:18 AM IST

తన క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేశ్​ కుమార్​ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు వాదనలు ఆలకించనుంది.

Nirbhaya case: SC to hear plea of one of four death row convicts against dismissal of mercy plea
రేపు సుప్రీం వద్దకు నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్​

నిర్భయ దోషి దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. తన క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దోషి ముఖేశ్​ కుమార్ శనివారం​ అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశాడు.

జస్టిస్​ ఆర్​. భానుమతి, జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ ఏ.ఎస్​ బోపన్నతో కూడిన ధర్మాసనం రేపు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పిటిషన్​ను విచారించనుంది.

ఫిబ్రవరి 1న నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో ముఖేశ్​ పిటిషన్​ సర్వత్రా చర్చనీయాంశమైంది.

Last Updated : Feb 28, 2020, 4:18 AM IST

ABOUT THE AUTHOR

...view details