తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2020, 1:10 PM IST

Updated : Feb 29, 2020, 12:42 PM IST

ETV Bharat / bharat

నిర్భయ దోషుల ఉరి అమలు​పై ఫిబ్రవరి 11న విచారణ

Nirbhaya case: SC to hear on Feb 11 Centre's plea against Delhi HC verdict
నిర్భయ దోషుల ఉరి అమలు​పై ఫిబ్రవరి 11న సుప్రీం విచారణ

14:28 February 07

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధించడాన్ని సవాల్​ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్​ను ఫిబ్రవరి 11న విచారిస్తామని సుప్రీం తెలిపింది. నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ ఇటీవల దిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

జస్టిస్​ ఆర్​ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్​ను విచారిస్తుంది. కేంద్రం తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా వాదనలు వినిపించారు. వాదనల్లో భాగంగా దేశ సహనాన్ని పరీక్షిస్తున్నారని మెహతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నలుగురు దోషులకు నోటీసులు జారీ చేయాలని మెహతా చేసిన అభ్యర్థనను.. ధర్మాసనం తిరస్కరించింది.

ఫిబ్రవరి 11న విచారణలో నోటీసులు ఇచ్చే అవసరాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 

13:02 February 07

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు​పై ఫిబ్రవరి 11న సుప్రీం విచారణ

  • నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టులో విచారణ
  • తదుపరి విచారణను ఫిబ్రవరి 11 మధ్యాహ్నం 2 గం.కు వాయిదా
  • నిర్భయ దోషులకు ఉన్న న్యాయపరమైన అవకాశాలన్ని ఉపయోగించుకునేందుకు హైకోర్టు వారం రోజుల సమయాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు
  • ఫిబ్రవరి 12న హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తున్నందున వాయిదా
  • నలుగురు నిర్భయ దోషులకు నోటీసు జారీ చేయాలని సొలిసిటర్ జనరల్ చేసిన అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
Last Updated : Feb 29, 2020, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details