తెలంగాణ

telangana

By

Published : Dec 21, 2020, 8:17 PM IST

ETV Bharat / bharat

కొత్త రకం కరోనా ఎఫెక్ట్​- మహారాష్ట్రలో మళ్లీ కర్ఫ్యూ

ఐరోపా దేశాలను కలవరపెడుతోన్న కొత్తరకం కరోనా వైరస్​ పట్ల మహారాష్ట్ర సర్కార్​ అప్రమత్తమైంది. ఈ మేరకు 15రోజుల పాటు రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపింది ఠాక్రే ప్రభుత్వం.

Night curfew in Maharashtra civic corporation areas from Dec 22-Jan 5
కొత్తరకం కరోనా ఎఫెక్ట్​- మహారాష్ట్రలో మళ్లీ కర్ఫ్యూ

కొత్త రకం కరోనా గురించి బ్రిటన్​లో భయాందోళనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్​​ వ్యాప్తిని అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ ప్రకటించింది. ఈ నెల 22నుంచి 2021 జనవరి 5 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. యూకేలో పరిస్థితులను పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. రాబోయే 15రోజులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు.

కర్ఫ్యూ నిబంధనల్లో భాగంగా.. మున్సిపల్​ కార్పొరేషన్​ ప్రాంతాల్లో రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడనున్నాయి. అంతేకాకుండా.. ఇటీవల ఐరోపా, పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చిన వారికి 14రోజుల నిర్బంధం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేసింది.

ఇదీ చదవండి:అక్కడి పంచాయతీ ఎన్నికల బరిలో ఓ 'యాచకుడు'

ABOUT THE AUTHOR

...view details