దేశవ్యాప్తంగా నదులు, చెరువుల సంరక్షణకు ఎలాంటి ప్రణాళికలు లేనందున జాతీయ హరిత ట్రైబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2021 జనవరి 31లోపు నోడల్ ఏజెన్సీ అధికారులు సమావేశం కావాలని నిర్దేశించింది. నీటి సంరక్షణపై ప్రణాళిక రూపొందించాలని సూచించింది.
'జల సంరక్షణకు ప్రతి రాష్ట్రంలో నోడల్ ఏజెన్సీ'
దేశంలోని నదులు, చెరువులను సంరక్షించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది జాతీయ హరిత ట్రైబ్యునల్. నీటి వనరుల సంరక్షణకు ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరిలోపు నోడల్ సభ్యులు సమావేశం అయి జిల్లా యంత్రాంగాలకు సూచనలు చేయాలని తెలిపింది.
'జల సంరక్షణకు ప్రతి రాష్ట్రంలో నోడల్ ఏజెన్సీ'
గురుగ్రామ్లోని ఘటా సరస్సును పునరుద్ధరించాలంటూ మాజీ లెఫ్టినెంట్ కల్నల్ సర్వధామన్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఎన్జీటీ ఈ నిర్ణయం తీసుకుంది.