తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో మరో కొత్త వ్యాధి- సుడాన్​ నుంచి వ్యాప్తి!

కేరళలో 'ప్లాస్మోడియం ఓవల్'​ అనే ఒక కొత్త రకం మలేరియాను కనుగొన్నారు వైద్యులు. సుడాన్​ నుంచి వచ్చిన ఓ జవానుకు సోకినట్లు గుర్తించామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు.

By

Published : Dec 11, 2020, 12:27 PM IST

New genus of malaria
కేరళలో కొత్త రకం మలేరియా

కేరళ రాష్ట్రంలో 'ప్లాస్మోడియం ఓవల్​' అనే కొత్త రకం మలేరియాను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. ఈ వ్యాధి సుడాన్​ నుంచి వచ్చిన ఓ జవాను సోకినట్లు గుర్తించామని చెప్పారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

" రాష్ట్రంలో కొత్త రకం మలేరియా ప్లాస్మోడియం ఓవల్​ను గుర్తించాం. కన్నూర్​ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ జవాను శరీరంలో ఈ వ్యాధి ఉన్నట్లు తేలింది. అతను సుడాన్​ నుంచి వచ్చాడు. సరైన సమయంలో చికిత్స అందించటం, నివారణ చర్యలు చేపట్టటం వల్ల ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోగలిగాం. "

- కేకే శైలజ, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి

భారత్​లో కరోనా వైరస్​ తొలి కేసు కూడా కేరళలోనే వెలుగుచూసింది. త్రిస్సూర్​ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి వూహాన్​ నుంచి వచ్చిన క్రమంలో అతనికి వైరస్​ సోకినట్లు గుర్తించారు. అలాగే.. 2018లో కోజికోడ్​ జిల్లాలో నిఫా వైరస్​ వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో కొత్త రకం మలేరియాపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.

ఇదీ చూడండి: రోగనిరోధక శక్తిని తగ్గించే అలవాట్లు ఇవే!

ABOUT THE AUTHOR

...view details