తెలంగాణ

telangana

By

Published : Mar 24, 2020, 10:40 AM IST

Updated : Mar 24, 2020, 1:24 PM IST

ETV Bharat / bharat

దేశంలో 500కు చేరువలో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు 500కు చేరువయ్యాయి. ప్రస్తుతం 492 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో 41 మంది విదేశీయులు ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.

corona
దేశంలో 500కు చేరువలో కరోనా కేసులు

భారతీయులను కరోనా వైరస్​ కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా వైరస్​ కేసులు 500లకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 492 మంది ప్రాణాంతక మహమ్మారి బారినపడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది.

దేశంలో ప్రస్తుతం 446 యాక్టివ్​ కేసులున్నాయి. 36 మంది కరోనాను జయించి ఆసుపత్రి నుంచి ఇళ్లకు చేరారు. సుమారు 41 మంది విదేశీ బాధితులూ భారత్​లో చికిత్స పొందుతున్నారు.

వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నెల 31 వరుకు దేశవ్యాప్తంగా 548 జిల్లాల్లో లాక్​డౌన్ విధించింది కేంద్రం. ప్రజా రవాణా సేవలు నిలిపివేసింది. ఎవరైనా బయటకు వస్తే అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

మహారాష్ట్రలో 100 దాటిన కేసులు!

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 101కి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజాగా పుణేలో 3, సతారాలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:దేశవ్యాప్తంగా 548 జిల్లాలు పూర్తిగా లాక్​డౌన్​

Last Updated : Mar 24, 2020, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details