మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ భాజపా అధికారంలోకి వచ్చి గంటలైనా గడవక ముందే మహారాష్ట్ర మరో ఆసక్తికర అంశానికి వేదికైంది. ఓ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ.. ఠాణే జిల్లాలోని షాహాపుర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
'మహా'నాటకీయం: ఎస్సీపీ ఎమ్మెల్యే ఆచూకీ గల్లంతు! - ncp mla missing
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందన్న దశలో ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నాటకీయ పరిణామాలకు మాత్రం తెరపడలేదు. ఎన్సీపీ ఎమ్మెల్యే ఒకరు కనిపించకుండా పోయారని షాహాపుర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
'మహా'నాటకీయం: ఎస్సీపీ ఎమ్మెల్యే ఆచూకీ గల్లంతు!
రాజ్భవన్లో ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యే దౌలత్ దరోడా హాజరయ్యారని, అనంతరం కనిపించకుండా పోయారని పేర్కొంటూ మాజీ ఎమ్మెల్యే పాండురంగ్ బరోరా షాహాపుర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. దరోడా షాహాపుర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇదీ చూడండి: 'మహా' ప్రభుత్వంపై నేడు సుప్రీం అత్యవసర విచారణ