తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్ ఎన్నికల నిర్వహణపై మోదీతో ఫరూక్​ భేటీ - ఒమర్ అబ్దుల్లా

జమ్ము కశ్మీర్​ శాసనసభ ఎన్నికల నిర్వహణ విషయమై ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది ఫరూక్​ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్​ కాన్ఫరెన్స్​ పార్టీ. తమ అభ్యర్థనలను మోదీ ముందు పెట్టింది. ప్రధానితో 20 నిమిషాల పాటు భేటీ అయిన ఎన్​సీ పార్టీ ప్రతినిధుల బృందం కశ్మీర్​లోని పరిస్థితులను వివరించారు.

ఫరూక్​

By

Published : Aug 1, 2019, 6:20 PM IST

Updated : Aug 1, 2019, 11:32 PM IST

మోదీతో ఎన్సీ నేతల​ భేటీ

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫరూక్​ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్​ కాన్ఫరెన్స్(ఎన్​సీ) పార్టీ ప్రతినిధుల బృందం ప్రధాని నరేంద్రమోదీని కలిసింది. ఎన్నికలను ఈ ఏడాది ఆఖరులోగా నిర్వహించాలని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు పార్టీ నేతలు.

లోయలో పరిస్థితులపై వివరణ

మోదీతో దాదాపు 20 నిమిషాల పాటు సమావేశమైన ఎన్​సీ సభ్యుల బృందం కశ్మీర్‌లోయలోని పరిస్థితులను దెబ్బతీసేలా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది. కశ్మీర్‌లోని తాజా పరిస్థితులను ప్రధానికి వివరించిన పార్టీ నేతలు ప్రజలపై కొనసాగుతున్న అరెస్టుల పర్వాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజాభీష్టాన్ని గౌరవిస్తాం..

ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లకు సంబంధించి నూతనంగా ఎన్నికయ్యే ప్రభుత్వం.. నిర్ణయాలు తీసుకుంటుందన్నారు ఒమర్‌ అబ్దుల్లా. అయితే ఎవరికి అధికారం కట్టబెట్టాలనేది ప్రజల ఇష్టమని అభిప్రాయపడ్డారు. ప్రజాభిప్రాయాన్ని తామంతా గౌరవిస్తామని తెలిపారు.

ప్రధానితో సమావేశం సంతృప్తికరంగా సాగిందన్న ఒమర్​ అబ్దుల్లా... మోదీ ఏం చెప్పారనేది వెల్లడించడానికి నిరాకరించారు.

ఇదీ చూడండి: 'భారత దౌత్యాధికారులకు జాదవ్​ను కలిసే అవకాశం​'

Last Updated : Aug 1, 2019, 11:32 PM IST

ABOUT THE AUTHOR

...view details