తెలంగాణ

telangana

By

Published : Jan 18, 2020, 8:05 PM IST

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో రెచ్చిపోయిన నక్సల్స్​..పలు వాహనాలు దగ్ధం

ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లాలో నక్సలైట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. రోడ్టు నిర్మాణ పనులు జరుగుతోన్న ప్రాతంలో పలు వాహనాలకు నిప్పుపెట్టారు.

Naxals torch trucks, concrete mixer machine in Sukma
వాహనాలు, యంత్రానికి నిప్పుపెట్టిన మావోయిస్టులు

ఛత్తీస్​గఢ్​ సుక్మా జిల్లాలో నక్సలైట్లు పేట్రేగిపోయారు. తాంగ్​పాల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చిడ్పాల్​ గ్రామంలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను మావోయిస్టులు అడ్డుకున్నారు. ఓ ప్రైవేట్​ కాంట్రాక్ట్​ సంస్థకు చెందిన పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ దుశ్చర్యలో రెండు ట్రాక్టర్లు, ఒక వాటర్​ ట్యాంకర్​, ఒక కాంక్రీట్​ మిక్చర్​ మిషన్ దగ్ధమయ్యాయి.

ప్రధానమంత్రి సడక్​ యోజన కింద చిడ్పాల్​ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తగినంత సెక్యూరిటీ లేనందున పనులను చేపట్టవద్దని పోలీసులు ఇప్పటికే సంబంధిత కాంట్రాక్టర్​ను హెచ్చరించారు. అయినా వినకుండా పనులను కొనసాగించారని.. ఈ క్రమంలోనే మావోయిస్టులు రోడ్డు పనులకు వినియోగిస్తున్న వాహనాలు, యంత్రాన్ని దహనం చేశారని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:'పోల్​నెట్​ 2.0'తో భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details