తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో నక్సల్స్​ దుశ్చర్య.. పలు వాహనాలకు నిప్పు - Chhattisgarh news

ఛత్తీస్​గఢ్​ బిజాపుర్​ జిల్లా గంగలూర్​ ప్రాంతంలో నక్సల్స్​ పేట్రేగిపోయారు. ఇసుక సరఫరా చేసే పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఆరు మినీ ట్రక్కులు దగ్ధమయ్యాయి.

Naxals
ఛత్తీస్​గఢ్​లో నక్సల్స్​ దుశ్చర్య.. పలు వాహనాలకు నిప్పు

By

Published : Jan 9, 2020, 10:45 PM IST

ఛత్తీస్​గఢ్​లో నక్సలైట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. బిజాపుర్​ జిల్లాలో ఇసుక సరఫరా చేసే ఆరు మినీ ట్రక్కులకు నిప్పుపెట్టి దగ్ధం చేశారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంగలూరు పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చెర్పాల్​ నది సమీపంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. ఇసుక తీసుకెళ్లేందుకు నది పక్కన నిలిపి ఉంచిన వాహనాలకు నిప్పుపెట్టి.. దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు.

ఛత్తీస్​గఢ్​లో నక్సల్స్​ దుశ్చర్య.. పలు వాహనాలకు నిప్పు

ఇసుక తరలింపులో స్థానికుల మధ్య గొడవలే ఇందుకు కారణంగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇసుక కేటాయింపుల్లో తమకు దక్కలేదనే అక్కసుతోనే కొంతమంది నక్సలైట్ల మద్దతుతో ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బంగాల్​: సీఐడీ వాహనాలను పేల్చేసిన దుండగులు

ABOUT THE AUTHOR

...view details