తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నక్సలైట్ల దాడిలో జవాను మృతి - ​ దంతేవాడ

ఛత్తీస్​గఢ్​ దంతేవాడ జిల్లాలో నక్సలైట్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ సీఆర్పీఎఫ్​ జవాను మృతి చెందారు. మొత్తం ఆరుగురికి గాయాలయ్యాయి.

నక్సలైట్ల దాడిలో జవాను మృతి

By

Published : Mar 18, 2019, 9:31 PM IST

Updated : Mar 19, 2019, 8:16 PM IST

నక్సలైట్ల దాడిలో జవాను మృతి

ఛత్తీస్​గఢ్​లోని దంతేవాడ జిల్లాలో నక్సలైట్లు మరోసారి రెచ్చిపోయారు. మావోయిస్టులు అత్యాధునిక పేలుడు పదార్థాన్ని(ఐఈడీ) పేల్చారు. ఈ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్​ జవాను మృతి చెందారు. ఐదుగురు జవానులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.

రాష్ట్ర పోలీసులతో పాటు 231 బెటాలియన్​కు చెందిన సీఆర్పీఎఫ్​ బృందం అరన్​పుర్​ ప్రాంతంలో రోడ్డు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. అరన్​పుర్​ పోలీసు స్టేషన్​ పరిధిలోని కొండపార, కమల్​పుర్​ గ్రామాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో ఐఈడీ పేల్చి, కాల్పులు జరిపారు నక్సల్స్​. సీఆర్పీఎఫ్​ జవానులు దీటుగా స్పందించారు.

Last Updated : Mar 19, 2019, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details