తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశా సీఎంగా నేడు పట్నాయక్​ ప్రమాణస్వీకారం

ఒడిశా శాసనసభ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన బిజు జనతాదళ్​(బీజేడీ) నేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆ పార్టీ అధినేత నవీన్​ పట్నాయక్​ వరుసగా ఐదో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

By

Published : May 29, 2019, 5:50 AM IST

Updated : May 29, 2019, 7:35 AM IST

పట్నాయక్​ ప్రమాణ స్వీకారం నేడే...

పట్నాయక్​ ప్రమాణస్వీకారం నేడే

ఇటీవల ముగిసిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది నవీన్​ పట్నాయక్​ నేతృత్వంలోని బిజు జనతాదళ్​. 147 స్థానాలున్న శాసనసభలో 112 సీట్లు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించింది. 2000 సంవత్సరం నుంచి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్​ పట్నాయక్​ రికార్డు స్థాయిలో ఐదోసారి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఒడిశాలో ముఖ్యమంత్రితో కలిపి మంత్రిమండలి పరిమితి 21. ఉదయం 10.30 గంటలకు ఎగ్జిబిషన్​ మైదానంలో ప్రారంభం కానున్న కార్యక్రమంలో పట్నాయక్​ సహా మొత్తం 21 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మంత్రివర్గంలో ఈ సారి కొత్తగా 10 మందికి అవకాశం కల్పించారు పట్నాయక్. 11 మంది కేబినెట్​ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. భువనేశ్వర్​లో ప్రమాణస్వీకారం చేసేముందు జగన్నాథ్​ ఆలయాన్ని సందర్శించనున్నారు బీజేడీ అధ్యక్షుడు.

వరుసగా ఐదోసారి....

2000 సంవత్సరం నుంచి రాష్ట్రంలో అధికారంలోనే కొనసాగుతోంది బిజు జనతా దళ్​. 2000, 04, 09, 14లలో ముఖ్యమంత్రి పట్నాయకే. నేడు ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించారు పట్నాయక్​. అయితే.. ఒడిశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు మోదీ సుముఖంగా లేరని పార్టీ వర్గాల సమాచారం.

ఒడిశా అసెంబ్లీలో భాజపా 23 సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్​ 9 స్థానాలకే పరిమితమైంది. లోక్​సభ ఎన్నికల్లో మాత్రం బిజు జనతాదళ్​కు గట్టిపోటీనిచ్చింది కాషాయ పార్టీ. 21 స్థానాల్లో బీజేడీ 12, భాజపా 9 చోట్ల విజయం సాధించాయి.

Last Updated : May 29, 2019, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details