ఇటీవల ముగిసిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్. 147 స్థానాలున్న శాసనసభలో 112 సీట్లు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించింది. 2000 సంవత్సరం నుంచి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ రికార్డు స్థాయిలో ఐదోసారి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఒడిశాలో ముఖ్యమంత్రితో కలిపి మంత్రిమండలి పరిమితి 21. ఉదయం 10.30 గంటలకు ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభం కానున్న కార్యక్రమంలో పట్నాయక్ సహా మొత్తం 21 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మంత్రివర్గంలో ఈ సారి కొత్తగా 10 మందికి అవకాశం కల్పించారు పట్నాయక్. 11 మంది కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. భువనేశ్వర్లో ప్రమాణస్వీకారం చేసేముందు జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు బీజేడీ అధ్యక్షుడు.