తెలంగాణ

telangana

By

Published : Jan 31, 2021, 6:30 PM IST

ETV Bharat / bharat

'పుదుచ్చేరి మారుతుంది.. కమలం వికసిస్తుంది'

భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పుదుచ్చేరిలో పర్యటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పుదుచ్చేరి శాసనసభలో భాజపా.. 23కి పైగా స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Nadda claims to win 23 plus Assembly seats in Puducherry
'పుదుచ్చేరిలో 23కి పైగా స్థానాలు మావే'

భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. ఆదివారం పుదుచ్చేరి పర్యటనలో బిజీబిజీగా గడిపారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే 23కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. క్రియాశీల కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. "పుదుచ్చేరి మారుతుంది-కమలం వికసిస్తుంది" అనే నినాదాన్ని ఇచ్చారు.

పుదుచ్చేరి పర్యటనలో పంచకట్టులో మెరిసిన నడ్డా..

"కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే శాసనసభలో 23 సీట్ల కన్నా ఎక్కువగా గెలుస్తామనే నమ్మకం కలుగుతోంది. పుదుచ్చేరికి మంచి రోజులు రాబోతున్నాయి. భాజపా చేసే అభివృద్ధితో పుదుచ్చేరిని అవినీతి రహితంగా మారుద్దాం."

-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు.

పుదుచ్చేరి సీఎం నారాయణస్వామిపై తీవ్ర విమర్శలు గుప్పించిన నడ్డా.. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పుదుచ్చేరిని సరిగా అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ఝార్ఖండ్​కు రూ.5 వేల కోట్ల రుణాలు మాఫీ చేసారని.. పుదుచ్చేరికి మాత్రం అప్పుడూ, ఇప్పుడూ ఆయన చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.

నడ్డా ఆద్వర్యంలో పుదుచ్చేరి పార్టీ కార్యకర్తల సమావేశం
నడ్డా సమావేశానికి హజరైన మహిళా ప్రతినిధులు..

అంతకుముందు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు నుంచి పుదుచ్చేరి చేరుకున్న ఆయనకు భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

ఇదీ చదవండి:చిన్నమ్మ దారెటు? పార్టీపై పెత్తనం సాధ్యమా?

ABOUT THE AUTHOR

...view details