తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2020, 11:32 AM IST

Updated : Jun 23, 2020, 11:57 AM IST

ETV Bharat / bharat

నడ్డా- రాహుల్​ మధ్య 'చైనా' వార్​

భారత్‌- చైనా సైనికుల మధ్య ఘర్షణ అంశంపై అధికార, విపక్ష నేతల మధ్య మాటలు, ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. భారత భూభాగాన్ని చైనా సైన్యం ఆక్రమించిందా? అని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మరోసారి కేంద్రాన్ని ప్రశ్నించగా.. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్​ హయాంలోనే చైనా కమ్యూనిస్టు పార్టీ, హస్తం పార్టీల మధ్య అలాంటి ఒప్పందం కుదిరిందని దుయ్యబట్టారు.

nadda
నడ్డా- రాహుల్​ మధ్య 'చైనా' వార్​

కేంద్ర ప్రభుత్వం.. చైనాకు భారత భూభాగాన్ని అప్పగించిందని రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. 2008లో కాంగ్రెస్, చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని మండిపడ్డారు. ఆ తర్వాతే భారత భూభాగాన్ని చైనాకు కాంగ్రెస్​ అప్పగించిందని ట్విట్టర్‌లో ఆరోపించారు నడ్డా. అప్పట్లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి హోదాలో రాహుల్‌ గాంధీ, ప్రస్తుత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నాయకుడి హోదాలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని నడ్డా అన్నారు.

కష్ట సమయంలో రాహుల్‌ దేశాన్ని విభజించి, సైనిక దళాల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా ప్రయత్నిస్తుంటారని ఎదురుదాడికి దిగారు. డోక్లాం ఘటన జరిగిన సమయంలో కూడా రాహుల్‌ చైనా దౌత్య కార్యాలయానికి రహస్యంగా వెళ్లినట్లు ఆరోపించారు నడ్డా.

రాహుల్​ ట్వీట్​లో ఏముందంటే..

భారత భూభాగం ఆక్రమణపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని మరోసారి ప్రశ్నించారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ తీసిన పాంగాంగ్‌ సో సరస్సు ఫొటోను ట్విట్టర్​​లో పోస్ట్ చేశారు రాహుల్‌. సరిహద్దుల్లో చైనా చేస్తున్న దురాక్రమణలను యావత్తు దేశం ఐకమత్యంగా వ్యతిరేకిస్తోందని అన్నారు.

Last Updated : Jun 23, 2020, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details