తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2020, 11:36 AM IST

ETV Bharat / bharat

నిసర్గ ఎఫెక్ట్​: ముంబయిలో హై అలర్ట్​.. పలు రైళ్లు రద్దు

నిసర్గ తుపాను తరుముకొస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ముంబయి విమానాశ్రయం వద్ద హై అలర్ట్ ప్రకటించారు. పలు రైళ్లు రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇవాళ మధ్యాహ్నం 1గంట నుంచి 3గంటల మధ్య రాయ్​గఢ్​ జిల్లాలోని అలీబాగ్​ వద్ద నిసర్గ తుపాను తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

Mumbai on edge as cyclone Nisarga nears; trains rescheduled
నిసర్గ ఎఫెక్ట్​: పలు రైళ్లు రద్దు, కొన్ని దారి మళ్లింపు

నిసర్గ తుపాను ఇవాళ మధ్యాహ్నం 1గంట నుంచి 3 గంటల మధ్య రాయ్​గఢ్​ జిల్లాలోని అలీబాగ్ వద్ద తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ తుపాను తీరం దాటే సమయంలో 110 కి.మీ నుంచి 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.

తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం

మహారాష్ట్ర తీర ప్రాంతాలైన ముంబయి సహా రత్నగిరి, పాల్​ఘర్​, సింధు దుర్గ్​, రాయ్​గఢ్​, థానే జిల్లాలపై నిసర్గ ప్రభావంఉంటుందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముంబయి విమానాశ్రయం వద్ద హై అలర్ట్ ప్రకటించారు. కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు.

144 సెక్షన్

ముంబయిలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని బృహత్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ సూచించింది. తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో రెండు రోజుల పాటు ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జాగ్రత్తలు పాటించండి

నిసర్గ తుపాను నుంచి ప్రజలు సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనల జాబితా విడుదల చేసింది.

పోటెత్తుతున్న అలలు

నిసర్గ తుపాను తరముకొస్తున్న కొద్దీ తీరం వెంబడి అలలు పోటెత్తుతున్నాయి. ప్రస్తుతం ముంబయి నగరంలో 20 మి.మీ నుంచి 40 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం హెచ్చరించింది.

ముందు జాగ్రత్త చర్యలు

సహాయక చర్యల కోసం ఇప్పటికే ఎన్​డీఆర్​ఎఫ్ బలగాలను ఆయా నగరాల్లో మోహరించారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అప్రమత్తమైన గుజరాత్​

నిసర్గ తుపాను నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లో ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలను మోహరించింది.

ప్రధాని సమీక్ష

మహారాష్ట్ర, గుజరాత్ పరిస్థితుల గురించి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ చర్చించారు. సాధ్యమైనంత మేర సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:హైవే పక్కనే రన్​వే నిర్మాణం- చైనానే లక్ష్యం!

ABOUT THE AUTHOR

...view details