దక్షిణ ముంబయి డోంగ్రీలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 40 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తండెల్ వీధిలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో 100 ఏళ్ల నాటి కేసర్బాఘ్ భవనం అమాంతం కుప్పకూలిపోయింది. ఈ భవనాన్ని పునర్నిర్మాణం కోసం ఓ డెవలపర్కు ఇచ్చారని తెలుస్తోంది. శిథిలావస్థలో ఉన్నందున అవసరమైన చర్యలు చేపట్టాలని భవనంలో నివాసం ఉండేవారు ప్రభుత్వ అధికారులను కోరినప్పటికీ వారు సరిగా స్పందించలేదని సమాచారం.
ఘటన సమయంలో 15 కుటుంబాలకు చెందిన 40 నుంచి 50 మంది భవనంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు
ప్రమాద సమాచారం అందిన వెంటనే... జాతీయ విపత్తు నిర్వహణ దళం- ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించడమే లక్ష్యంగా అధునాతన సాంకేతికత, సామగ్రి సాయంతో సహాయ చర్యలు చేపట్టింది. స్థానికులూ వీరికి సహకరించారు.
ముందే హెచ్చరించిన నగర పాలిక
కేసర్బాఘ్ భవనం శిథిలావస్థకు చేరిందని బృహన్ ముంబయి పురపాలక సంస్థ (బీఎమ్సీ) 2017, ఆగస్టు 7నే హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భవనాన్ని కూల్చివేసేందుకు వీలుగా సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేయాలని అప్పట్లోనే సూచించింది బీఎమ్సీ. అయినా ఆ హెచ్చరికలను యజమానులు పెడచెవిన పెట్టగా... పెను విషాదం జరిగింది.
మోదీ దిగ్భ్రాంతి...