తెలంగాణ

telangana

కోమాలోనే ప్రణబ్ ​ముఖర్జీ: ఆర్మీ ఆసుపత్రి

By

Published : Aug 29, 2020, 2:37 PM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇంకా వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ ఆస్పత్రి తెలిపింది. ఆరోగ్య సూచిలన్నీ నిలకడగానే ఉన్నట్లు స్పష్టం చేసింది.

Mukherjee's renal parameters improve, still in deep coma: Hospital
కోమాలోనే ప్రణబ్​ముఖర్జీ: ఆర్మీ ఆసుపత్రి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వెంటిలేటర్​ పైనే ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​కు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తున్నాయని, రక్త ప్రసరణ, గుండె, పల్స్​ స్థాయి సాధారణంగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని శనివారం విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో పేర్కొన్నారు. పారామితులు కొంత మేర మెరుగుపడినట్లు వైద్యులు వివరించారు.

ముఖర్జీ ఆగస్టు 10న ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. అదే రోజు ఆయనకు మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స నిర్వహించారు. అంతకుముందే ఆయనకు కరోనా సోకినట్లు తేలింది.

ABOUT THE AUTHOR

...view details