తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం: కూటమికి ఝలక్- ముంబయికి నాగరాజు

కర్ణాటక అధికార కూటమికి అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు ఝలక్​ ఇచ్చారు. కూటమి అగ్రనేతల భేటీ అనంతరం పార్టీలో కొనసాగుతానని తెలిపిన ఆయన.. మళ్లీ మనసు మార్చుకున్నారు. రెబల్​ ఎమ్మెల్యేల శిబిరంలో కలిసేందుకు ముంబయి బయలుదేరారు నాగరాజు.

By

Published : Jul 14, 2019, 12:12 PM IST

నాగరాజు

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్​ బుజ్జగింపు ప్రయత్నాలు మళ్లీ మొదటికి వచ్చాయి. కాంగ్రెస్​లో కొనసాగుతానన్న మంత్రి ఎంటీబీ నాగరాజు నిర్ణయాన్ని మార్చుకున్నారు. రెబల్​ ఎమ్మెల్యేలతో కలిసేందుకు ముంబయి బయలుదేరారు.

నాగరాజు నిర్ణయంతో అసంతృప్తుల శిబిరంలో ఎమ్మెల్యే సుధాకర్​ కూడా చేరే అవకాశం ఉంది.

చర్చలు వృథా...

నాగరాజు రాజీనామా నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లిన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ మధ్యాహ్నం వరకు మంతనాలు జరిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభాపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంట్లో నాగరాజుతో చర్చలు సాగాయి.

ఈ చర్చల్లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, కేపీసీసీ సారథి దినేశ్ గుండురావుతో పాటు ముఖ్యమంత్రి కుమారస్వామి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పదవికి ఇచ్చిన రాజీనామాను వెనక్కితీసుకోవడం సహా కాంగ్రెస్‌లోనే కొనసాగేలా నాగరాజును ఒప్పించారు.

ఈ విషయంలో విజయం సాధించారని సంతోషించేలోపు నాగరాజు మళ్లీ మనసు మార్చుకుని కూటమి ఆశలపై నీళ్లు చల్లారు.

ఇదీ చూడండి: కర్ణాటకీయం: బుజ్జగింపుల్లో కూటమి- ధీమాగా భాజపా

ABOUT THE AUTHOR

...view details