200అడుగుల లోతులో బాలుడు- మృత్యువుతో పోరాటం - five years boy falls in borewell in madhya pradesh
మధ్యప్రదేశ్ నివాడి జిల్లాలో ఐదేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
![200అడుగుల లోతులో బాలుడు- మృత్యువుతో పోరాటం MP: Five year old falls in borewell, rescue operation on](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9428567-399-9428567-1604487333902.jpg)
200అడుగుల లోతులో మృత్యువుతో పోరాటం
200అడుగుల లోతులో మృత్యువుతో పోరాటం
మధ్యప్రదేశ్ నివాడి జిల్లా భారాబుజర్గ్ గ్రామంలో ఐదేళ్ల బాలుడు బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయాడు. భారాబుజర్గ్కు చెందిన హరికృష్ణ కుష్వాహా కుమారుడు ప్రహ్లాద్ 200అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిపోయినట్లు పృథ్వీపుర్ ఎస్ఐ నరేంద్ర త్రిపతి వెల్లడించారు. సుమారు వంద అడుగుల లోతు మేర నీరు ఉందని తెలిపారు. బాలుడు ఎంత లోతులో చిక్కుకున్నాడనేది తెలియాల్సి ఉందన్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.